పేజీలు

22, డిసెంబర్ 2020, మంగళవారం

క్రిస్మస్ అంటే ఏమిటి? రెండవ భాగము

మొదటి భాగము కోసం ఇక్కడ నొక్కండి

ఆదికాండము 3: "16.  ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. 17.  ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;"

ఆదాము, అవ్వలు సాతాను అబద్దాలను నమ్మి  దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దేవుడు ఆ పాపమును బట్టి సర్పమును శపించి  అవ్వను శిక్షించాడు అదే విధంగా ఆదామును బట్టి భూమిని శపించాడు. ఆ తరుణంలో దేవుడు మానవాళి పట్ల తానూ నెరవేర్చబోయే వాగ్దానమును సెలవిచ్చి యున్నాడు. 

ఆదికాండము 3: "15 మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను."

పై వచనములో స్త్రీ సంతానము యేసు క్రీస్తును ఉద్దేశించి చెప్పిన మాటలు. ఇవే మాటలను అపొస్తలుడయినా పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో వివరించారు.

గలతీయులకు 4: "4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి, 5. మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను." 

పై వచనము స్పష్టము చేస్తున్న విషయము ఏమిటీ? దేవుడు మానవాళికి వాగ్దానము చేసినట్లుగా తన కుమారుణ్ణి, యేసు క్రీస్తును, ఈ లోకమునకు పంపి ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. తద్వారా ఆయనను నమ్మిన వారందరికి అయన నీతి వర్తించేలాగున ఆయనను అనుగ్రహించాడు. ఈ విషయాలను మరింత బాగా స్పష్టం చేసే ముందు, మొదటి భాగములో చెప్పిన దేవుని నియమాలు ఏమిటి? వాటిని చూసే ముందు ఇశ్రాయేలు జనమును గురించి తెలుకోవటం అవసరం. 

గలతీయులకు 3: "6.  అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను. 7. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి. 8.  దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖ నము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. 9. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు." 

పై వచనములో ఉన్న ఈ అబ్రాహాము గారు అప్పుడు ఉన్న ప్రజలకు పూర్తిగా భిన్నమయిన వ్యక్తి. విగ్రహారాధనను వ్యతిరేకించి తన విశ్వాసముతో దేవుణ్ణి అనుసరించి అయన అనుగ్రహం పొందిన వాడు. సంతానము లేని తనకు దేవుడు ఇచ్చిన వాగ్దానము "నీ సంతానమును గొప్పగా విస్తరింపజేస్తానని, సముద్రములో ఇసుక రేణువులంతగా అయన సంతానము ఉంటుందని". తన వాగ్దానము ప్రకారము దేవుడు అబ్రాహాముకు ఇస్సాకు అనబడే కుమారుని అనుగ్రహించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, వారిలో చిన్నవాడు యాకోబు. ఈ యాకోబు దేవునితో పెనుగులాడి ఆశీర్వదింపబడ్డాడు. అందునుబట్టి దేవుని తో ఇశ్రాయేలు అని పిలవబడ్డాడు. 

ఆదికాండము 32: "28.  అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను." 

ఈ ఇశ్రాయేలుకు / యాకోబుకు పన్నెండుమంది కుమారులు, వారి ద్వారానే ఇశ్రాయేలు జనములో గోత్రాలు ఏర్పడ్డాయి. ఇశ్రాయేలు జనమును దాస్యము లో నుండి విడిపించిన తర్వాత దేవుడు కొన్ని గోత్రములకు విధులను సూచించాడు. అయితే వారిలో లేవియులు యాజకత్వము చేయాలనీ దేవుని నిర్ణయము. ఈ లేవీయులు దేవుని మందిరములో ఉంటూ ప్రజలు తెచ్చే పాప పరిహారములను వారి తరపున దేవునికి బలులుగా అర్పించేవారు. దేవుడు ప్రతి పాపమునకు ఎటువంటి బలి అర్పించాలన్న నిబంధనలు రాయించాడు. 

లేవీయకాండము 6: "6.  అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకునియొద్దకు తీసికొని రావలెను. 7.  ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును." 

లేవీయకాండము 17: "11. ​రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును." 

హెబ్రీయులకు 9: "1. ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును. 2. తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. 3. ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు."

పై వచనములు స్పష్టం చేస్తున్నది ఏమిటి? రక్తము చిందితేనే పాపమునకు క్షమాపణ. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు జనములో లేవి వంశము నుండి ఒక ప్రధాన యాజకుడు తన పాపములను బట్టి ప్రాయశ్చిత్తము చేసుకొని తర్వాత ప్రజల పాపమూ నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేస్తాడు. తద్వారా వారి పాపములకు దేవుని యెదుట ప్రాయశ్చిత్తము చెల్లించి క్షమాపణ పొందారు అప్పటి ప్రజలు. 

హెబ్రీయులకు 2: "14. ......మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, 15. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. 16. ఏల యనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు."

పై వచనంలో మరణ బలము గలవాడు అనగా అపవాది అంటే మొదటి భాగములో చెప్పుకున్న సాతాను. అనగా అహంకారము చేత దేవునికి లోబడక నరకమునకు అణగద్రొక్కబడ్డవాడు. వాడిని మరణము ద్వారా నశింపజేయటానికి, మరణ భయము చేత అనగా పాపమూ ద్వారా వచ్చే దాని చేత పీడింపబడుతున్న వారిని విడిపించుఁటకు అబ్రాహాము సంతానంగా అనగా మానవునిగా అవతరించాడు. ఆపై మరణము పొంది తానూ చేసిన శాసనము చెల్లుబాటు చేశాడు అని క్రింది వచనముల ద్వారా స్పష్టం అవుతుంది. 

హెబ్రీయులకు 9 : "16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. 17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?" 

మరియు  ప్రధాన యాజకులు చేసే ప్రాయశ్చిత్తము కంటే, పాపమూ లేని యేసు క్రీస్తు రక్తము ఒకేసారి మానవాళికి పాప క్షమాపణ  అనగా మరల, మరల అవే బలులు అవసరం లేనంతగా పాపమును రద్దు చేసిందని క్రింది వచనముల ద్వారా మనకు అవగతమవుతుంది. 

హెబ్రీయులకు 10: "10. యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. 11.  మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. 12. ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, 13. అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను. 14. ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

అయితే మొదటి భాగము లో మనం నేర్చుకున్న ముఖ్యమయిన అంశము, ప్రతి వాడు పాపం చేసియున్నాడు, తల్లి గర్భమందే మనలను పాపం ఆవరించిందని. ఆదాము అవ్వల ద్వారా మనం పొందుకున్న శరీరం పాపంతో నిండుకున్నదని తెలుసుకున్నాం.  మరి మనిషిగా పుట్టిన యేసు క్రీస్తు పాపంలేని వాడిగా ఎలా పరిగణింపబడ్డాడు? అయన కూడా మానవ శరీరంలోనే ఈ భూమి మీదికి వచ్చాడు కదా! వచ్చే భాగంలో దేవుని చిత్తను సారముగా తెలుసుకుందాం. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!

మూడవ భాగము కోసం ఇక్కడ నొక్కండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి